ఖమ్మం, మార్చి 10 : ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్కుమార్తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్ఫాంల నిర్మాణం, కొవిడ్కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరు వంటి అంశాలపై బోర్డు చైర్మన్తో చర్చించారు.
ఎంపీ రవిచంద్ర ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై రవిచంద్ర బోర్డు చైర్మన్కు విజ్ఞాపన రూపంలో అందజేశారు.