ఖమ్మం, నవంబర్ 26: ఖమ్మం బైపాస్ రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీశ్రీశ్రీ గ్రూపు వారు నూతనంగా నిర్మించిన ఉషాహరి కన్వెన్షన్, శ్రీశ్రీశ్రీ ఎక్సెలెన్సీ హోటల్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. 1500 మందికి సరిపోయే సామర్థ్యం కలిగిన సెంట్రల్ ఏసీ హాల్, పార్కింగ్ సౌకర్యం, 20 ఏసీ గెస్ట్ రూములతో ఈ హోటల్ను అత్యధునాతనంగా నిర్మించినట్లు గ్రూపు సంస్థల చైర్మన్ ఈశ్వరప్రగడ హరిబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పునుకొల్లు నీరజ, తెలంగాణ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహనశర్మ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దోరేపల్లి శ్వేత, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, బేబీ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.