ఖమ్మం ఎడ్యుకేషన్, మే 25: తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసిన ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రి విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారు. విద్యార్థులను పాఠశాలల అధినేతలు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు.
‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం ఎడ్యుకేషన్, మే 25: తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో వివేక్వర్థన్ వర్మ139వ ర్యాంక్, జాన్వితాదేవి 199, జశ్వంత్ కుమార్ 245, ఇందు 258, శ్రీతేజ 261, అర్షియా నౌరిన్ 314, హర్షిత్ 351, సహస్ర 409, కీర్తన్ వర్మ 490, సాయి నిఖితారెడ్డి 527, హర్షవర్థన్ 790, భరత్ 791, శివ గుప్తా 858, పూజిత 871, సాత్విక 915, రామ్చరణ్ 957, అఖిత 969వ ర్యాంక్లు సాధించారన్నారు. 2వేల లోపు ర్యాంక్లు 28 మంది, 3 వేలలోపు ర్యాంక్లు 42 మంది సాధించారన్నారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాశ్, గోపాలకృష్ణ అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో న్యూవిజన్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని విద్యాసంస్థ చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. ఇంజినీరింగ్ అండ్ అగ్రి విభాగంలో జి.నీరజ్రెడ్డి 98వ ర్యాంక్ , ఎం.సుష్మశ్రీ 120, ధనుష్ 129, రిత్విక్ 174, భవ్య 196, వెంకట సాత్విక్ 249, సాయిశ్రీరామ్ 337, యశ్వనాథ్ 364, వరుణ్ 386, రాహుల్ 387, హర్షిత్శ్రీ 396, జాస్మిత 436, చాణక్య 437, సోబియా 551, సాయిఅన్వేష్ 571వ ర్యాంక్లు సాధించారన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 470 మంది, అగ్రి విభాగంలో 80 మంది పరీక్షకు హాజరుకాగా 125 మంది 10వేల లోపు ర్యాంక్లు సాధించార న్నారు. విద్యార్థు లను విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ కార్తీక్, కళాశాల ప్రిన్సిపాల్స్ అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో హార్వెస్ట్ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారని విద్యాసంస్థల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో ఉదారపు మోహన్సాయి 256వ ర్యాంక్, చేతన్మయి 1,679, హరిదీప్ సాయి 1,994, గాయత్రి 2,828, నిరూప్ 2,925, పల్లవి 3,135వ ర్యాంక్ సాధించారన్నారు. కళాశాల నుంచి 190 మంది పరీక్షకు హాజరు కాగా వీరిలో ఎక్కువ మంది మంచి ర్యాంక్లు సాధించారన్నారు. అగ్రి విభాగంలో 39 మంది పరీక్షకు హాజరు కాగా త్రినాథ్ 772వ ర్యాంక్, షరోన్ జకులైన్ 1,501, అక్షర సంక్రాంతి 2,436వ ర్యాంక్లు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించినట్లు కళాశాల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి 1,048వ ర్యాంక్, మౌక్తిక 1,696, జోషిక శివాని 2,905, రాజేష్ 3,973వ ర్యాంక్ సాధించారు. అగ్రి విభాగంలో అంజుమ్ 1,023వ ర్యాంక్, చంద్రిక లక్ష్మి 3,993, వినీల 4,077, అమన్ 7,895 ర్యాంక్లు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్స్ సతీశ్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంజినీరింగ్ అండ్ అగ్రి విభాగంలో చందన 948, శ్రీశాంత్ 1,126, విజయ్కుమార్ 2,351, నేహశ్రీ 2,386, చైతన్య 2,540, రోహిత 2,895, సతీశ్ 3,043, నిఖిలశ్రీ 5,078, వాసు 5,229, శ్వేతారెడ్డి 5,479, రిషిత 6,490వ ర్యాంక్ సాధించారన్నారు. విద్యార్థులను డైరెక్టర్స్ జగదీశ్, కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రామచందర్, అధ్యాపకులు అభినందించారు.