దమ్మపేట, అక్టోబర్ 19 : కార్యకర్తలు అండగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండల కేంద్రం దమ్మపేటలోని అర్బన్కాలనీకి చెందిన సీపీఐ, టీడీపీ నేతలతోపాటు పెద్దఎత్తున యువత, చిన్నగొల్లగూడెంలో బీజేపీకి చెందిన నేతలు ఎమ్మెల్యే నివాసమైన తాటి సుబ్బన్నగూడెంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మెచ్చా గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై యువత, పలు పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో అన్నికులాలు, మతాల వారికి సమన్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ చేస్తున్న కృషి మరువలేనిదని, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో దమ్మపేటకు చెందిన పంబి ఏసు, ప్రభుదాసు, దండా లక్ష్మణ్, అబ్బు, సాంబి రాజేశ్, కుంజా సాయి, వేణు, సాయి, రాము, పానకాలు, డేవిడ్, శివ, దుర్గాప్రసాద్, అజ్మీర్, సత్తి గణేశ్, వీరబాబు, పాపిరాజు, ప్రసాద్, హబీబ్, గొర్రెపాటి చిన్ని, బలగాని కృష్ణ, పోలయ్య, బాబ్జాన్, కొయ్యల వెంకటేశ్వరరావు, చిన్నగొల్లగూడేనికి చెందిన సంగసాని రాంబాబు, సంగసాని జయరాజు, మంగళగిరి చిరంజీవి, కవులూరి రాంబాబు, సుధాపల్లి నుంచి నాలుగు కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.