భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారుల బదిలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అధికారులను పొరుగు జిల్లాలకు, అక్కడి అధికారులను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈవో విద్యాలతను హనుమకొండకు, ములుగు జడ్పీ సీఈవో ప్రసూనారాణిని భద్రాద్రికి బదిలీ చేశారు. భద్రాద్రి డీఆర్డీవో మధుసూదన్రాజును సూర్యాపేటకు, ఖమ్మం డీఆర్డీవో విద్యాచందనను భద్రాద్రికి బదిలీ చేశారు. అలాగే, భద్రాద్రి డీపీవో రమాకాంత్ను మహబూబాబాద్కు, పెద్దపల్లి డీపీవో చంద్రమౌలిని భద్రాద్రికి బదిలీ చేశారు. ఇక్కడి జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మిని ఖమ్మం డిప్యూటీ సీఈవోగా బదిలీ చేసి.. ఖమ్మం నుంచి వచ్చే చంద్రశేఖర్ను ఆమె స్థానంలో నియమించారు. కొత్తగూడెం సీడీపీవో స్వర్ణలత లెనీనా ములుగు జిల్లా సంక్షేమాధికారిగా బదిలీ అయ్యారు. కొత్తగూడెం అడిషనల్ డీఆర్డీవో (సెర్ప్) నీలయ్యను ఖమ్మానికి, ఖమ్మం అడిషనల్ డీఆర్డీవో జయశ్రీని కొత్తగూడేనికి బదిలీ చేశారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 12: ఖమ్మం జిల్లా నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులకు స్థానచలనం కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జడ్పీ సీఈవో వీవీ అప్పారావును సూర్యాపేట జడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. హైదరాబాద్ టీఎస్ఐఆర్డీ సీఈవో ఎస్.వినోద్ను ఖమ్మం జడ్పీ సీఈవోగా నియమించారు. ఖమ్మం జడ్పీ డిప్యూటీ సీఈవో కే.చంద్రశేఖర్ను భద్రాద్రి జిల్లాకు, అక్కడి డిప్యూటీ సీఈవో బీ.నాగలక్ష్మిని ఖమ్మం జిల్లాకు అదే హోదాల్లో బదిలీ చేశారు. ఖమ్మం డీఆర్డీవో ఎం.విద్యాచందనను భద్రాద్రి డీఆర్డీవోగా, మహబూబాబాద్ డీఆర్డీవో ఆర్.సన్యాసయ్యను ఖమ్మం డీఆర్డీవోగా నియమించారు. ఖమ్మం అదనపు డీఆర్డీవో శిరీషను సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు.భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి కీసర ఆర్డీవోగా బదిలీ అయ్యారు.
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కమిషనర్ ఈ.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-1 సీఐ కే.రాజు ఖిలా వరంగల్ స్టేషన్కు బదిలీ చేసి ఆ స్థానంలో మహబూబాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ బీ.కృష్ణను నియమించారు. వైరా సీఐ వేమిరెడ్డి రమ్యను భూపాలపల్లి సీఐగా బదిలీ చేసి ఆ స్థానంలో యూబీ నాచారం సీఐ మమతను, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ ఆర్.రాజును మణుగూరు బదిలీ చేసి ఆ స్థానంలో ఖిలా వరంగల్ సీఐ చంద్రమోహన్ను, నేలకొండపల్లి సీఐ కే.పోశెట్టిని పెద్దపల్లికి బదిలీ చేసి ఆ స్థానంలో పరకాల సీఐ కే.జగన్నాథరావును, మధిర సీఐ ఎం.ప్రసాద్ను పాల్వంచకు బదిలీ చేసి ఆ స్థానంలో మణుగూరు సీఐ రామ్మూర్తిని, సత్తుపల్లి సీఐ వీ.రాజశేఖర్రావును వేములవాడకు బదిలీ చేసి ఆ స్థానంలో భూపాలపల్లి సీఐ ప్రవీణ్కుమార్రెడ్డిని, సింగరేణి సీఐ జుల్పీకర్అహ్మద్ను ఇచ్చోడకు బదిలీ చేసి ఆ స్థానంలో కాటారం సీఐ ఎం.ప్రశాంతిని, ఖమ్మం జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ ఆర్.విజేందర్ను ఆదిలాబాద్కు బదిలీ చేసి ఆ స్థానంలో హనుమకొండ ఐఎంఎల్ డిపో-1 సీఐ బీ.కరుణశ్రీని, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ వై.సర్వేశ్వరరావును జగిత్యాల సీఐగా బదిలీ చేసి ఆ స్థానంలో రామగుండం సీఐ ఎస్.రమేశ్ను, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ పీ.శామ్యుల్ జాన్ను కాగజ్నగర్కు బదిలీ చేసి ఆ స్థానంలో ఆదిలాబాద్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ను నియమించారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న అధికారులు వెంటనే వారి స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.