మామిళ్లగూడెం, జనవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పారింగ్కు అంతరాయం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధం కావాలని ఐజీపీ షాహన్వాజ్ ఖాసీం, ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి సూచించారు. బందోబస్తు విధులకు హాజరవుతున్న పోలీస్ సిబ్బందికి భక్తరామదాసు కళాక్షేత్రంలో సోమవారం సమావేశం నిర్వహించి బందోబస్తు విధివిధానాలపై మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఐజీపీ షాహనవాజ్ ఖాసీం మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బందోబస్తు అని, ప్రతి ఒకరూ నిబద్ధతతో తమ బాధ్యతలు నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సిబ్బందికి అప్పగించిన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించాలని, సమయస్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. పారింగ్ ప్రాంతాల్లో వాహనాలు సక్రమ పద్ధతిలో పార్క్ చేసేలా విజయవంతం అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తదని అన్నారు.
ఈ సమావేశానికి ముందుగా రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెం వద్ద నిర్మించిన నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని, ఆ పక్కనే సభా ప్రాంగణాన్ని ఇతర పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాలకు వీవీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలం, బహిరంగ సభ వేదిక, పారింగ్ ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, డీఐజీ కే.రమేశ్నాయుడు, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్, మహబూబాబాద్ ఎస్పీ శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.