భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా సోమవారం యువ టూరిజం క్లబ్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లాలో టూరిజం రంగంపై అవగాహన పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతలో పర్యాటక ప్రదేశాల పట్ల ఆసక్తి పెంచడంతోపాటు వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయన్నారు. టూరిజం వారోత్సవాల సందర్భంగా 19న పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద టూరిజం అవేర్నెస్ డ్రైవ్, 20న కారుకొండ రామవరంలోని బౌద్ధ రాక్ కేవ్స్ వద్ద హెరిటేజ్ వాక్, 21న యూట్యూబర్లతో సమావేశం, 22న బౌద్ధ రాక్ కేవ్స్ ప్రాంతంలో స్వచ్ఛ డ్రైవ్, 23న పాల్వంచలోని ఐడాక్లో బ్రాండ్ కిట్ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.
జిల్లా రెవెన్యూ అధికారిగా నూతనంగా నియమితులైన పద్మావతి సోమవారం కలెక్టర్ అంకిత్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవెన్యూశాఖకు సంబంధించిన పలు అంశాలపై స్వల్పంగా చర్చించారు.