కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర కానుకలు చోరీకి గురైనట్లు సమాచారం. ఇటీవల మండలపరిధిలోని మంగళితండా ఆంజనేయస్వామి ఆలయంలో రెండుసార్లు హుండీ పగులుగొట్టి నగదు చోరీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.