కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 3: అక్రమంగా తరలుతున్న గంజాయి రవాణా వాహనాన్ని త్రీ టౌన్ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఒడ్డేపల్లి మురళి కథనం ప్రకారం.. త్రీ టౌన్ పోలీసులు ఓల్డ్ డిపో ఏరియాలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ కారును చేజ్ చేసి పట్టుకున్నారు.
తనిఖీ చేయగా అందులో రూ.55.59 లక్షల విలువైన 222 కిలోల గంజాయి ఉంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తులు రాజస్తాన్లోని జోధ్పూర్కి చెందిన సునీల్, సత్రం అలియాస్ సత్పల్ (డ్రైవర్)గా గుర్తించారు. గంజాయితోపాటు వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,800 నగదు, ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.