ఖమ్మం, మే 4: దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.