భద్రాచలం, డిసెంబర్ 25 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న నెహ్రూ కప్ క్రికెట్ పోటీల కోసం మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. కాగా.. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించాలని కోరారు.
క్రికెట్ పోటీల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎండీ.నవాబ్, రేపాక పూర్ణ, ఉడత రమేశ్, తాండ్ర నర్సింహారావు, తాళ్లపల్లి రమేశ్ గౌడ్, నిర్వాహకులు బాలయోగి, అట్లూరి శ్రీధర్, మడిపల్లి నాగార్జున, గుమ్మూలూరి శ్రీనివాస్, కుంచాల రాజారాం, బాల మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.