భద్రాచలం/ దుమ్ముగూడెం, అక్టోబర్ 3: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గన్ ఇన్చార్జి తాతా మధు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావును గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను కూడా మూడోసారి గెలిపించి ముఖ్యమంత్రిగా దీవించాలని కోరారు.
దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణ నివాసంలో బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావుతో కలిసి మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాముడు, జానీపాషా, కామేశ్, వెంకటయ్య, భీమరాజు, చందు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, లక్ష్మణ్, జయసింహ, వెంకట్, గంగరాజు, వెంకటరమణ (బుజ్జి), నర్సింహారావు, సీతారామారావు, సిల్వకుమార్, కిరణ్, పాయం వెంకటేశ్, బొలిశెట్టి రంగారావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంలో వాకర్స్తో మాటామంతీ
బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపును కాంక్షిస్తూ ఎమ్మెల్సీ తాతా మధు మంగళవారం భద్రాచలం పర్యటించారు. మంగళవారం ఉదయం ఆయన తెల్లం వెంకట్రావు, బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్షుడు అరికెల్ల తిరుపతిరావుతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ను కలిసి వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ నిధులతో వాకర్స్కు ట్రాక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణ ప్రముఖులు యోగి సూర్యనారాయణ, ఆలీంఖాన్, డాక్టర్ పవన్కుమార్, రంగారెడ్డి తదితరుల ఇళ్లకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు దారపునేని రాంబాబు, చావా లక్ష్మీనారాయణ, కటుకూరి హరిబాబు, రూపా కేశవ్ తదితరులు పాల్గొన్నారు.