ఖమ్మం : జిల్లాలో అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2020-2021 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు గతంలో ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోనివారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఈ పాస్ వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఫ్రెష్, రెన్యూవల్ చేసుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.