జైపూర్ ఎస్టీపీపీలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ నిర్మాణం వడివడిగా కొన సాగుతున్నది. సాధారణంగా థర్మల్ పవర్ప్లాంటులో బొగ్గు ను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగిం చి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దానితో టర్బైన్లను తి ప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రాథమిక పర్యావరణ చర్యగా బొగ్గును మండించడం ద్వారా వెలువడే బూడిద, విష వాయువులను శుద్ధిపరిచే ప్రక్రియను చేపడుతారు. థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే వాయువులో ఉండే బూడిదను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే అనుబంధ విభాగా న్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా బూడిదను 100శాతం గాలిలో కలువకుండా చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రెసిపిటేటర్ విభాగంలో సమకూరిన బూడిదను ైప్లెయాష్ అంటా రు. ఈ ఫ్లైయాష్ను కూడా నూటికి నూరుశాతం సిమెంటు తదితర పరిశ్రమలకు సరఫరా చేస్తూ జాతీయ స్థాయిలో ’బె స్ట్ ఫ్లైయాష్ యూటిలైజేషన్’ అవార్డును ఎస్టీపీపీ అందుకు న్నది. అలాగే పర్యావరణ శాఖ నిబంధనల మేరకు శుద్ధి చేసిన వాయువును థర్మల్ప్లాంట్ చిమ్ని ద్వారా విడుదల చేస్తున్నారు. కాగా పాత నిబంధనలు అనుసరించి బయటకు పం పే వాయువును మరింత శుద్ధి చేయాలని, ఇప్పటివరకు అనుమతిస్తున్న ప్రమాణాలకు మరింతగా కుదిస్తూ 2015లో కేం ద్ర పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గాలిలోకి విడుదల చేయడానికి అనుమతించబడిన సల్ఫర్ యాక్సైడ్ శాతం ఘనపు మీటర్కు 2000 మిల్లి గ్రా ములు ఉండగా దీనిని 200 మిల్లి గ్రాములకు కుదిస్తూ కొత్త నిబంధన విధించారు. ఈ నిబంధనలకు అనుగుణంగా దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్లాంట్లకు అనుబంధం గా ఎఫ్జీడీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్గా పిలువబడే ఈ ప్రక్రియలో బొగ్గు మండించగా వచ్చే వాయువులో దాగి ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులను వేరు చేస్తారు. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నిని ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నిలో కిందనుంచి పైకి వచ్చే వాయువుపై కాల్షియం కార్బోనేట్ (తడి సు న్నం)ను పై నుంచి బలంగా పంపిస్తారు. తద్వారా బొగ్గు మండించిన వాయువుల్లో ఉన్న సల్ఫర్డయాక్సైడ్ పలు దశల్లో తడి సున్నంతో రసాయనిక చర్య జరుగుతుంది. ఈ ప్రక్రియలో వాయువులో ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులన్నీ తడి సున్నంలోకి పీల్చుకోబడుతాయి. తత్ఫలితంగా బయటకు విడుదల చేస్తున్న వాయువులో సల్ఫర్ అనుబంధ వాయువుల శాతం ఘనపు మీటర్కు 200 మిల్లీ గ్రాములలోపే ఉంటుంది. ఈ రసాయనిక ప్రక్రియలో అంతిమంగా కాల్షియం సల్ఫేట్ అనే ఘన పదార్థం ఏర్పడుతుంది. దీనినే జిప్సం అంటారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో వెలువడే జిప్సంను ఎరువులు, సిమెంట్, పేపర్, వస్త్ర పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఈ ఎఫ్జీడీ నిర్మాణ తదుపరి కాలంలో జిప్సం అమ్మకాల ద్వారా కంపెనీకి మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలకు తక్షణమే స్పందిస్తూ సింగరేణి రూ. 696 కోట్ల వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని హైదరాబాద్కు చెందిన పీఈఎస్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేశారు. సీఅండ్ ఎండీ శ్రీధర్ ఈ పనులను ఎప్పటిక ప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. మొదటి యూనిట్కు సంబంధించి ఎఫ్జీడీని జూన్ 2024కల్లా పూర్తి చేయాలని, రెండో యూనిట్ సెప్టెంబర్ 2024కల్లా పూర్తి చేయాలని అధికారు లకు దిశానిర్దేశం చేశారు. గత ఫిబ్రవరి 16 న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో అధికారులతో సమీ క్ష నిర్వహించా రు. గడువుకన్నా ముందే పనులు పూర్తి చేసి ప్లాంటును ప్రా రంభించాలని నిర్మాణ ఏజెన్సీ సంస్థలకు సూచించారు.
పర్యావరణహిత ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్న సింగరేణి యాజమాన్యం, మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఎస్టీపీపీని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియను మొదలు పెట్టింది. రూ. 696 కోట్లతో ప్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కాగా, పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేసేలా సీఎండీ శ్రీధర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు.