రఘునాథపాలెం, అక్టోబర్ 7: ఖమ్మంలో ‘జేసీ మాల్’ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇల్లెందు క్రాస్ రోడ్డులోని ఐటీ హబ్ ఎదురుగా శనివారం ఈ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీ తార రీతూవర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అధునాతమైన హంగులతో రూపుదిద్దుకున్న జేసీ మాల్లోని నూతన వస్ర్తాలయం, సిల్వర్, గోల్డ్ జ్యూయలరీ విభాగాలను ఓపెన్ చేశారు. జేసీమాల్ను ప్రారంభించేందుకు వచ్చిన రీతూవర్మను చూసేందుకు అభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దీంతో ఇల్లెందు క్రాస్రోడ్డు నుంచి వైరా వెళ్లే ప్రధాన రహదారి జనసంద్రమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన, నమ్మకమైన వస్ర్తాలు, ఆభరణాలు లభించేలా జేసీ మాల్ను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు.. ‘దిగు దిగు దిగు నాగో..’ పాటకు స్టెప్పులేశారు. బిగ్బాస్ షో ఫేం కాజల్, జేసీ మాల్ నిర్వాహకులు కృష్ణారావు, వెంకటరెడ్డి, మర్రి జమునారెడ్డి, మర్రి మధుమతిరెడ్డి, మర్రి శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.