ఖమ్మం : ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్కు నామ పత్రాలు సమర్పించారు. రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి అజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు అభ్యర్థి విజయం కోసం దృష్టిసారించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన తాతా మధును పార్టీ ఎంపిక చేశారు.
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు విస్తరించి ఉంది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ కావడంతో తాతా మధు మంత్రి అజయ్కుమార్, జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ మంగళవారం వేయనున్నారు.
సోమవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తాతా మధుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బీఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడతోపాటు ఎమ్మెల్యేలు రాములు నాయక్, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.