ముదిగొండ, మార్చి 5 : ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ముదిగొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గదులన్నింటినీ కలిగి తిరుగుతూ మాస్ కాపీయింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచే గదిని సందర్శించి.. అకౌంట్ బుక్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.