టేకులపల్లి, నవంబర్ 1 : తెలంగాణ రాష్ట్రం తరఫున సెకండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ కబడ్డీ పోటీలకు కెప్టెన్గా గిరిజన బిడ్డ మాలోత్ అశోక్నాయక్ ఎంపికయ్యాడు. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని సుక్కలబోడు పంచాయతీకి చెందిన వ్యవసాయ కూలీ మాలోత్ రావోజీ, దేవిల పెద్ద కుమారుడు అశోక్నాయక్.
ఇతడు ఖమ్మంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువున్నాడు. అశోక్నాయక్కు కబడ్డీ అంటే మక్కువతో చిన్న వయస్సు నుంచే మండల, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చాడు. ప్రస్తుతం నవంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు గోవాలో జరిగే సెకండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ కబడ్డీ పోటీలకు రాష్ట్రం తరఫున కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించనున్నాడు. దాతలు సాయం చేస్తే కబడ్డీలో మరింత రాణించి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని అశోక్నాయక్ కోరుతున్నాడు.