కల్లూరు/ పెనుబల్లి/తల్లాడ, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రజలకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ పూట ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరెలను పంపించారని అన్నారు. కల్లూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలందరికీ బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ప్రభుత్వ సారెగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెను పంపడం గొప్ప విషయమని అన్నారు. బతుకమ్మ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు బాబ్జీ ప్రసాద్, కట్టా అజయ్బాబు, పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, కొండూరి కిరణ్, ఎస్కే కమ్లీ, కంభంపాటి వెంకటేశ్వరరావు, గంగవరపు వెంకటేశ్వరరావు, కల్యాణపు కొండలరావు, సత్యనారాయణరెడ్డి, వెంకటరామారావు, వీరాస్వామి పాల్గొన్నారు.
పూల పండుగ ‘బతుకమ్మ’
భిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పెనుబల్లి, తల్లాడ మండలాల్లో శుక్రవారం ఆయన బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. పండుగ కానుకగా మహిళలకు చీరెలు అందించే ప్రత్యేకత తెలంగాణ సొంతమని అన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, కావూరి మహాలక్ష్మి, చెక్కిలాల లక్ష్మణ్రావు, భూక్యా పంతులి, కనగాల వెంకటరావు, భూక్యా ప్రసాద్, ముక్కర భూపాల్రెడ్డి, మందడపు అశోక్కుమార్, లగడపాటి శ్రీను, కనగాల సురేశ్ పాల్గొన్నారు.