సత్తుపల్లి, ఆగస్టు 28 : ఉమ్మడి పాలనలో ఆ చెరువు వైపు కన్నెత్తి చూసే నాథుడు లేక.. అభివృద్ధికి నోచుకోలేదు. చెరువు చుట్టూ అనేక వనరులున్నా ట్యాండ్బండ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన కూడా ఆనాటి పాలకులకు తట్టలేదు. ఎన్నాైళ్లెనా ఇంతేనా.. అనుకునే తరుణంలోనే తెలంగాణ సిద్ధించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం పట్టణ శివారులోని వేశ్యకాంతల చెరువు అభివృద్ధికి పెద్దపీట వేసింది. పట్టణ శివారులో చెరువు ఉండడం, సమీపంలోనే పలు ఆలయాల సముదాయం, జేవీఆర్ పార్కు ఉండడంతో నిత్యం పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. నిండు కుండలా ఉన్న చెరువు పక్కనే ఆహ్లాదాన్ని పంచే పచ్చని పొలాలు ఉండడంతో చూసి తన్మయత్వం పొందుతుంటారు. ఈ చెరువును మరింతగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే సండ్ర ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు.
వేశ్యకాంతల చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.5కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. మే నెలలో పనులు ప్రారంభించగా పలు విభాగాల్లో చురుకుగా సాగుతున్నాయి. పనులన్నీ పూర్తయితే వేశ్యకాంతల చెరువు పర్యాటక కేంద్రంగా మారనుంది. కాగా.. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ప్రజలు, స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పర్యాటకులను ఆకర్షించడంతోపాటు పట్టణవాసులు నిత్యం వాకింగ్, జాగింగ్ చేసేందుకు వీలుగా వేశ్యకాంతల చెరువు మినీ ట్యాంక్బండ్పై సుందరీకరణ పనులు చేపట్టారు. కట్టను 5 మీటర్ల వెడల్పు నుంచి 10 మీటర్లకు పెంపు ఇరువైపులా పూల మొక్కలు, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు జరిగే బతుకమ్మ పండుగ కోసం విశాలమైన ఘాట్ల నిర్మాణం కింది భాగంలో వివిధ రకాల పూల మొక్కలు, చిల్డ్రన్స్ పార్కు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం, ఓపెన్ జిమ్ పక్కనే అన్ని సౌకర్యాలతో పార్కింగ్ సౌకర్యం కూర్చునేందుకు సౌకర్యవంతమైన బెంచీలు ఏర్పాటు సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి వేశ్యకాంతల చెరువు సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ల కృషితో అభివృద్ధికి నోచుకుంది. దీనిని మినీ ట్యాంక్బండ్గా మార్చడానికి ప్రభుత్వం రూ.5కోట్ల నిధులు కేటాయించింది. పనులన్నీ పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించనుంది. చెరువు వద్ద ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో ప్రజలకు చెరువు ఆహ్లాదాన్ని పంచనుంది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
మినీ ట్యాంక్బండ్ పనులన్నీ పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. పట్టణ ప్రజలు వాకింగ్ చేసేందుకు ట్రాక్ నిర్మాణం, సాయంత్రం వేళ ఆహ్లాదం పంచేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో ట్యాంక్బండ్గా తీర్చిదిద్దడం హర్షణీయం. సుమారు రూ.5కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించాం. చెరువు ఆధునీకరణ పనులకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే సండ్రకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కూసంపూడి మహేశ్, మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి