బోనకల్లు, మార్చి 17: పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన బోనకల్లులో ప్రత్యేక బోర్డర్ చెక్పోస్టును ఆదివారం ఏర్పాటు చేశారు. చెక్పోస్టును జిల్లా అదనపు కలెక్టర్ జీ మధుసూదన్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ బాధ్యతగా పాటించాలన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు తరలించడం నిషేధమన్నారు.
రూ.50 వేలు నగదు మించి ఎవరైనా తీసుకెళ్తే ఈ తనిఖీల్లో పట్టుబడినైట్లెతే వాటికి సరైన ఆధారాలు చూపించాలన్నారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో గణేశ్, తహసీల్దార్ పున్నంచందర్, ఎస్సై మధుబాబు, ఆర్ఐ లక్ష్మణరావు, పంచాయతీ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.