ఖమ్మం, ఏప్రిల్ 26 : ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం హైదరాబాద్లో మంత్రి అజయ్కుమార్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
పువ్వాడ ఆరోగ్యం కుదుటపడడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. తిరిగి పూర్తి ఆరోగ్యంతో మళ్లీ రాజకీయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. వారి వెంట మంత్రి అజయ్కుమార్ ఉన్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూడా హైదరాబాద్లో సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు. ఈ సందర్భంగా తమ అనుబంధాలను పంచుకున్నారు.