Khmmam : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సత్తుపల్లి RTC డిపో కార్యాలయంలో చోటు చేసుకుంది. కల్లూరు మండలం పాయపూర్ గ్రామానికి చెందిన మాలోతు వెంకన్న(45) RTC బస్ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
కాగా, శుక్రవారం సత్తుపల్లి ఆర్టీసీ డిపో కార్యాలయంలో బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.