ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో ఖమ్మం నగరంలో బీసీ భవన్ నిర్మాణం జరుగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి బీసీలకు భవన్ను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మణ్గౌడ్, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, పంచాయితీరాజ్ ఎస్ఈ సీతరాములు, ఈఈ రమచంద్రమౌలి, డీఈ శ్రీనివాస్, ఏఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.