అశ్వాపురం, డిసెంబర్ 27: వచ్చే నెలలో కేరళలోని త్రివేండ్రంలో జరగనున్న జాతీయస్థాయి అండర్-17 బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును తెలంగాణ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపిక పోటీలు ఐదు రోజులపాటు స్థానిక గౌతమీనగర్ కాలనీలోని మైదానంలో జరిగాయి. ప్రతిభ ఆధారంగా జట్టను నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ జట్టుకు కెప్టెన్గా మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్ పదోతరగతి విద్యార్థిని వైష్ణవిరత్న ఎంపికైంది.
సభ్యులుగా అక్షిత(రంగారెడ్డి), స్వాతి(మహబూబ్నగర్), హర్షిత(రంగారెడ్డి), అనన్య(ఖమ్మం), వైశాలి(మహబూబ్నగర్), ధృతి(రంగారెడ్డి), ఇందు(మహబూబ్నగర్), వైష్ణవి(రంగారెడ్డి), భాగ్య(ఖమ్మం), బి.శ్రీజ(నిజామాబాద్), వర్ష(నిజామాబాద్), అక్షయ(హైదరాబాద్), శ్రీతులసిరెడ్డి(ఆదిలాబాద్), అస్మిత సింగ్(మెదక్), స్నిగ్ధ(రంగారెడ్డి) స్టాండ్బైస్గా కె.ఝాన్సీ(ఖమ్మం), నాగశ్రీచరిత(రంగారెడ్డి), అక్షర(మహబూబ్నగర్)ను నిర్వాహకులు ఎంపిక చేశారు.