పాల్వంచ, మార్చి 19 : పాల్వంచలోని కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి మైదానంలో టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ వాలీబాల్, లాన్ టెన్నిస్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఏడో దశ సీఈ వెంకటేశ్వరరావు, 5, 6 దశల సీఈ ప్రభాకర్రావు, ట్రైనింగ్ సెంటర్ సీఈ శ్రీనివాసబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన లాన్ టెన్నిస్ సింథటిక్ కోర్టును వారు ప్రారంభించారు.
టోర్నమెంట్లో థర్మల్, హైడల్ స్టేషన్ నుంచి భూపాలపల్లి(కేటీపీపీ), పోచంపాడు, ఆర్టీఎస్ రామగుండం, విద్యుత్ సౌధ, జూరాల, పులిచింతల, బీటీపీఎస్ మణుగూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్, కేటీపీఎస్ ఏడో దశ, కేటీపీఎస్ 5, 6 దశల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా.. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీలకు కేటీపీఎస్ ఆతిథ్యమిచ్చింది. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ కే.శ్రీనివాసబాబు, జనరల్ సెక్రటరీ లోహిత్ ఆనంద్, ఎస్ఈ(సివిల్) యుగపతి, డీఈ శేఖర్, వై.వెంకటేశ్వర్లు, వీరస్వామి, వీరునాయక్, వెంకటేశ్వర్లు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.