Sri Rama Navami | భద్రగిరి కల్యాణ శోభ సంతరించుకున్నది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సారి కల్యాణానికి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిథిలా ప్రాంగణానికి చేరుకునేలా సమాచార శాఖ రూట్మ్యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్కింగ్ స్థలాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు, ప్రసాద కౌంటర్లు సిద్ధం చేసింది. బస్సులు, రైళ్ల వివరాలను విడుదల చేసింది. భద్రాచలంలో శ్రీరామనవమి నేపథ్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు, సౌకర్యాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు. గతంతో పోలిస్తే భద్రాచలం రూపురేఖలు మారిపోయాయి. బస్ ఎక్కడ దిగాలి.? ఎటు నుంచి ఆలయానికి వెళ్లాలి.? ఎక్కడ పార్కింగ్ స్థలం ఉంది. తదితర అంశాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
29వ తేదీ బుధవారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ, 4:30 నుంచి 5 గంటల వరకు ఆరాధన, 6 నుంచి 11:30 గంటల వరకు సర్వదర్శనం, శ్రీఘ్ర దర్శనం ఒక్కొక్కరికి రూ.100, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు భద్రుడి ఆలయంలో అభిషేకం, 8:30 నుంచి 11:30 గంటల వరకు సువర్ణతులసి అర్చన, 7 నుంచి 11:30 గంటల వరకు వేదపారాయణం, 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న ఆరాధన, రాజభోగం, 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం. సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఆరాధన, 5:30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 7 నుంచి 10 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, గరుడసేవ, 10 నుంచి 10:30 గంటల వరకు ఆరగింపు, నివేదన శాత్తుమురై, ఆలయం తలుపులు మూసివేత.
30 వతేదీన గురువారం రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. ఉదయం 2 గంటలకు ఆలయం తలుపులు తీస్తారు. 2 నుంచి 2:30 గంటల వరకు సుప్రభాత సేవ, 2:30 నుంచి 4 గంటల వరకు తిరువారాధన నివేదన, శాత్తుమురై, 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం, 5 నుంచి 5:30 గంటలకు వరకు అలంకారం, 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 8 నుంచి 9 గంటల వరకు శ్రీస్వామివారికి ధ్రువమూర్తుల తిరుకల్యాణం, 9 నుంచి 9:30 గంటలకు ఉత్సవ మూర్తులకు అలంకారం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు కల్యాణ మంటపంలో సీతారాముల తిరుకల్యాణం. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. 1 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం.. 6 నుంచి 6:30 గంటల వరకు ఆరాధన, 6 నుంచి 7:30 గంటల వరకు శ్రీరామ పునర్వసు దీక్షాధారణ, సాయంత్రం 6:30 నుంచి 10:30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 8 నుంచి 10 గంటల వరకు తిరువీధి సేవ, చంద్రప్రభ వాహనం, 6 నుంచి 6:30 గంటల వరకు నివేదన శాత్తుమురై, రాత్రి 10:30 గంటలకు ఆలయం తలుపులు వేస్తారు.
31వ తేదీన శుక్రవారం సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి 4:30 గంటలకు తలుపులు తీస్తారు. సుప్రభావత సేవ, 4 నుంచి 6:30 గంటలకు ఆరాధన, నివేదన, శాత్తుమురై, 6 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులకు ఆలయం నుంచి ఊరేగింపు, కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, తలుపులు వేస్తారు. 3 నుంచి 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 6.:30 గంటల వరకు ఆరాధన, 6.30 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 7 నుంచి 9:30 గంటల 10:30 ఆరగింపు, శాత్తుమురై, తలుపులు వేస్తారు.
పార్కింగ్ ప్రదేశాలు : మార్కెట్ యార్డు, చర్లరోడ్. జూనియర్ కాలేజీ మైదానం, ఐటీడీఏ రోడ్, కొత్త కూరగాయల మార్కెట్ గ్రౌండ్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా కూనవరం రోడ్, గోదావరి బ్రిడ్జి పక్కన మెయిన్ రోడ్, మిథిలా స్టేడియం వెనుక వీఐపీ పార్కింగ్. ఆర్అండ్బీ ఆఫీస్ స్థలం.
సమాచార కేంద్రాలు : కొత్తగూడెం బస్టాండ్, కొత్తగూడెం రైల్వేస్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్గేట్, మార్కెట్యార్డు, విస్తా కాంప్లెక్స్, దేవస్థానం ఏరియా, సబ్కలెక్టర్ కార్యాలయం, తాతగుడి సెంటర్, డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయం, చర్ల రోడ్, యూడీరోడ్, ఐటీడీఏ రోడ్డు, జూనియర్ కాలేజీ మైదానం, స్నానాల ఘాట్, బీఈడీ కాలేజీ, అంబేద్కర్ సెంటర్, ఎల్ఐసీ కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కల్యాణ మంటపం, సాధువుల మంటపం, ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, విస్తా కాంప్లెక్స్, కల్యాణ మంటపం ఎదురుగా, తానీషా కల్యాణ మంటపం వద్ద, మార్కెట్ యార్డు.
ప్రసాదాల కౌంటర్లు : కోర్టు ఏరియాలో 10, స్టీమర్రోడ్ ప్రవేశం వద్ద 4, రామానిలయం 5 సీతా నిలయం, ఆంజనేయ స్వామి దేవాయలం వెనుక క్యూలైన్ వద్ద, పడమట క్యూలైన్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ యార్డు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు.
తలంబ్రాలు కౌంటర్లు : స్టీమర్ రోడ్ వద్ద 28, విస్తా కాంప్లెక్స్ వద్ద 10, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 5, కోర్టు ఏరియా 5, మార్కెట్ యార్డు 5, కాలేజీ గ్రౌండ్ 5, ఆంజనేయ స్వామి పార్కింగ్ ఏరియా 2, బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆర్టీసీ ద్వారా ఉచిత తలంబ్రాలు పంపిణీ చేస్తారు.
భక్తులకు ఉచిత భోజనాలు : దేవస్థానం అన్నదాన సత్రంతోపాటు అయ్యప్పస్వామి, తాతగుడి సెంటర్లోని సాయిబాబా గుడి టెంపుల్, క్షత్రీయ అన్నదాన సత్రం, ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం, అంబసత్రం
మరుగుదొడ్డి, మూత్రశాలలు : ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, కల్యాణ మంటపం పక్కన, గోదావరి నదిలోని స్నానఘట్టాల పక్కన, విస్తా కాంప్లెక్స్ పక్కన, వసతి సౌకర్యాల వద్ద.
ప్రాథమిక చికిత్సా కేంద్రాలు : కొత్తగూడెం బస్టాండ్, కొత్తగూడెం రైల్వేస్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్గేట్, మార్కెట్యార్డు, విస్తా కాంప్లెక్స్, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాతగుడి సెంటర్, డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయం, చర్లరోడ్, యూడీ రోడ్, ఐటీడీఏ రోడ్డు, జూనియర్ కాలేజీ మైదానం, స్నానాల ఘాట్, బీఈడీ కాలేజీ, అంబేద్కర్ సెంటర్, ఎల్ఐసీ కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కల్యాణ మంటపం, సాధువుల మంటపం, ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, విస్తా కాంప్లెక్స్, కల్యాణ మంటపం ఎదురుగా, తానీషా కల్యాణ మంటపం వద్ద, మార్కెట్ యార్డు.
సమాచార ప్రచార శాఖ భక్తుల కోసం రూట్మ్యాప్ను అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన సీడీ ఆడియోను కూడా డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు కలెక్టర్ అనుదీప్ చేతులు మీదుగా ఆవిష్కరించారు.
పట్టాభిషేకం దర్శనం.. జంటకు వెయ్యి రూపాయలే..
ఈ నెల 31 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ మంటపంలో మహాపట్టాభిషేకం జరగనున్నది. జంటకు వెయ్యి రూపాయలు ప్రవేశ రుసుం నిర్ణయించారు. మిగిలిన సెక్టార్ల అన్నింటిలో ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. భక్తులకు కల్యాణ మంటంలో మంచినీరు, మజ్జిగ ఉచితంగా ఇస్తారు. యాత్రికులు గోదావరిలో స్నానాలు చేసేందుకు హద్దులు దాటి లోపలి వెళ్లరాదు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లల జేబులో చిరునామా, ఫోన్ నంబర్లు చిట్టీలను ఉంచాలి. తప్పిపోయిన పిల్లల విచారణ లేక పోలీస్, సమాచార కేంద్రాలు, చిన్నారుల కేర్ సెంటర్లలో అప్పగించాలి. భక్తులు సహాయ కోసం పోలీస్స్టేషన్ ఫోన్ నంబర్ 08743-232433, అగ్నిమాపక కేంద్రం 08743-232301, సబ్కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం నంబర్ 08743-232444కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
సింగరేణి ఉదయం 5:55 (నంబర్ 07260), సింగరేణి రాత్రి 7:50 (నంబర్ 07259), మణుగూరు ఎక్స్ప్రెస్ రాత్రి 10:45 (నంబర్ 127456), సికింద్రాబాద్- మణుగూరు తెల్లవారు జామున 4:30 గంటలకు (నంబర్ 12745)
ఖమ్మం సెక్టార్ : శ్రీశైలం ఉదయం 3:45 గంటలు
ఖమ్మం : ఉదయం 4:40 నుంచి రాత్రి 7:10 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు బస్ సౌకర్యం.
మిర్యాలగూడెం : ఉదయం 4:10, 6:15, 7:50, 11:10, 12:30, 13:30 గంటలకు..
మంచిర్యాల : ఉదయం 9:45 గంటలకు.
నల్గొండ : ఉదయం 11:45, 12:45, 13:45, 15:30
పరిగి : రాత్రి 18:15, 19:15
హైదరాబాద్ : ఉదయం 3:30, 7:15, 12:00, 21:30, 22:15, 10:00, 20:45, 04:45, 14:30, 15:30, 21:15
నిజామాబాద్ : 6:30, 21.00, హైదరాబాద్ 4:00, 13:00, 22:30, బీహెచ్ఈఎల్ 8:15, 22.00, తాండూరు 18:45, 20:30, హైదరాబాద్ : 5:45, 9:30, 13:15, 14:00, 15:30, 17:15, 18:15, 20:15, 8:45, 11:00
విజయవాడ సెక్టార్ : తిరుపతి 12:00, విజయవాడ 3:00, 13:40, గుంటూరు 21:20, 13:40, విజయవాడ వరకు ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 10:40 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం ఉంది.
అవనిగడ్డ : 17:15, మచిలీపట్నం 15:20, గుంటూరు 4:50, 8:20, 9:40, 12:20, 14:20, 20:00, 21:40, 22:00
రాజమండ్రి సెక్టార్ : విశాఖపట్నం ఉదయం 7:15, 9:00, 19:15, 21:00, రాజమండ్రి 4:00, 5:30, 6:30, 8:30, 9:15, 10:15, 11:00, 11:45, 12:30, 12:45, 13:15, 13:45, 14:10, 14:45, 15:15, 15:45, 16:15, 17:30, 18:30, 19:30, 21:30
హన్మకొండ సెక్టార్ : గోదావరిఖని 7:00, 9:15, 20:30, 21:00, 17:30, 21:30, 5:00, మంచిర్యాల 19:00, మణుగూరు నుంచి కరీంనగర్ 6:45, 11:45, వేములవాడ – కామారెడ్డి 9:45, 9:45, కరీంనగర్ 14:30, 16:00.
చింతూరు సెక్టార్ : కుంట 7:30, 9:00, 9:30, 10:30, 11:30, 12:00, 13:00, 13:30, 13:30, 15:30, 16:00, 17:00, జగ్దల్పూర్ 21:30, బైలడిల్లా 20:45
ఏలూరు సెక్టార్ : భీమడోలు 6:45, అమలాపురం – రాజోలు 7:30, 20:30, నర్సాపురం 14:00
వెంకటాపురం సెక్టార్ : ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది
రేఖపల్లి సెక్టార్ : ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.