ఖమ్మం : జిల్లాలోని సతుపల్లిలో గల మెట్ట అంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం ఓ మచ్చల జింక చనిపోయి పడిఉంది. అర్బన్ పార్క్ పక్కన జింక చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. పార్క్ ఫెన్సింగ్ గోడను ఢీకొని జింక చనిపోయి ఉండొచ్చని సతుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. జింకలు పార్కుకు ఎదురుగా ఉన్న ఆలయం చుట్టూ గల మామిడి తోటలకు వెళ్తుంటాయన్నారు. పార్క్కి, మామిడితోటలకు మధ్య రహదారి ఉంటుందన్నారు. ఈ రోడ్డు దాటే క్రమంలో చనిపోయిన జింక వేగంగా పరిగెత్తి ఉండొచ్చన్నారు.