ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున మంగళవాయిద్యాల నడుమ ఆలయం తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం పట్టువస్త్రాలు ధరింపచేసి ప్రత్యేక అలంకరణలలో భక్తులకు దర్శనం కల్పించారు. మహిళా భక్తులు పాలపొంగళ్లు తయారు చేసి స్వామివారికి నివేదించారు.