ఖమ్మంఎడ్యుకేషన్/ రఘునాథపాలెం, డిసెంబర్ 22: గణిత శాస్త్ర రంగంలో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని సాధించుకున్న మేధావి శ్రీనివాసా రామానుజన్ అని వక్తలు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విద్యాసంస్థల్లో రామానుజన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ‘బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చి’ అవార్డును అందుకున్న గొప్ప వ్యక్తి భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ అయ్యంగార్ అని కొనియడారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గణితంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. సర్వజ్ఞ, ఎస్వీఎం స్కూళ్లలో నీలిమ, నాగేంద్రకుమార్, శ్రీచైతన్యలో మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, గీతాంజలిలో టీవీ అప్పారావు, పద్మ, అరుణ్, విన్ఫీల్డ్లో మన్నె కిశోర్కుమార్, పోలవరపు శ్రీకాంత్, గద్దె పుల్లారావు, శ్రీవిద్యానికేతన్లో గొల్లపూడి రాంప్రసాద్, న్యూఇరాలో రమణారావు, భూమేశ్వరరావు, నిర్మల్ హృదయ్లో రమేశ్రెడ్డి, సాంబశివారెడ్డి, పద్మజ, రెజొనెన్స్ శ్రీనగర్లో కొండా శ్రీధర్రావు, కొండా కృష్ణవేణి, ప్రసన్నరావు, నారాయణలో చంద్రశేఖర్, పవన్, న్యూవిజన్లో సీహెచ్ కార్తీక్, ప్రసాద్, న్యూరిడ్జ్లో కాపూరి పద్మావతి, త్రివేణిలో వీరేంద్రచౌదరి, రాజేంద్రప్రసాద్, బ్లూమింగ్ మైండ్స్లో అశోక్రెడ్డి, కిరణ్కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.