రైల్వే, రోడ్డు మార్గాలను ఆదివారం తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేసింది. మంచు దట్టంగా అలుముకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం- బోనకల్లు, వైరా-జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లారు. ఖమ్మం- విజయవాడ ప్రధాన రైల్వేమార్గంలో కనీసం రైల్వే సిగ్నల్స్ కనిపించకుండా రైల్వేట్రాక్ మొత్తం మంచుతో కప్పబడింది.
ఈ మార్గంలో నడిచే శాతావాహన, కోణార్క్, మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు, గూడ్స్ రైళ్లు సైతం లైట్లు వేసుకొని, రైలు వేగాన్ని తగ్గించుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సిగ్నల్స్ కనిపించకపోవడంతో ట్రైన్ డ్రైవర్లు సమీప స్టేషన్ల స్టేషన్ మాస్టర్లతో వాకీటాక్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ రైళ్లను నడిపారు. ఉదయం 9గంటల తర్వాత మంచు వీడడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి.
– బోనకల్లు, జనవరి 1