తల్లాడ, నవంబర్ 18: నిరంతర శ్రామికుడిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మరోసారి కూడా గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్యనే ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయనకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. తల్లాడ మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నేతలు సంభాని చంద్రశేఖర్, కొండూరి సుధాకర్లతో కలిసి నూతనకల్, గూడూరు, కొత్తవెంకటగిరి, రామచంద్రాపురం, బిల్లుపాడు, అంజనాపురం, తెలగవరం, అన్నారుగూడెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధికి చేశారని గుర్తుచేశారు. సుమారు రూ.1,000 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేసి చూపించిన ఘనత సండ్రకే దక్కుతుందని అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు సంభాని చంద్రశేఖర్, కొండూరి సుధాకర్ మాట్లాడుతూ.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలుపు, నాలుగోసారి ఎమ్మెల్యేగా సండ్ర గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయనకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన తనను నియోజకవర్గ ప్రజలు నాలుగోసారి కూడా ఆశీర్వదించాలని కోరారు. కాగా, బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాయల శేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్రెడ్డి, వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, దిరిశాల దాసురావు, కేతినేని చలపతిరావు, బద్ధం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, ఓబుల సీతారామిరెడ్డి, మోగునూరి సంతోషం, తేలపుట్ల కృష్ణయ్య, తూము శ్రీనివాసరావు, తూము వీరభద్రరావు, నాయుడు శ్రీనివాసరావు, కోపెల కనకయ్య, రుద్రాక్షల బ్రహ్మం, బాణోతు మోహన్, వరపర్ల ఉదయ్, అయిలూరి శివారెడ్డి, దూపాటి నరేశ్రాజు, వనిగండ్ల అశోక్, దొడ్డ చిన్న శ్రీను పాల్గొన్నారు.