Khammam : ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు కాలువలో బోల్తా పడిన ఘటనలో 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులో మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రోజు ఇలా మద్యం తాగి వస్తాడని విద్యార్థులు ఏడుస్తూ చెప్పారు.
ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. వీరిలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన 40 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లనే బస్సు కాల్వలో పడిందని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. అయితే.. కాలువలో నీళ్లు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండడంతోనే బస్సు అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసుల అంచనా వేస్తున్నారు.