సత్తుపల్లి, డిసెంబర్ 22 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎంపికైంది. ఇందుకోసం వచ్చిన నగదుతోపాటు డిపోలోని ఉద్యోగులకు శుక్రవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. ఉత్తమ డిపోగా ఎంపికైనందుకు డిపోలోని 365 మంది ఉద్యోగులకు కేటగిరీలవారీగా బహుమతులు అందించిన అనంతరం ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలోనే ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఎంపిక కావడం పట్ల ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. వచ్చిన నగదుతో ఉద్యోగులందరికీ బహుమతులు ఇవ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేసి మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఏడీసీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.