ఖమ్మం : సంక్రాంతి సెలెబ్రేషన్స్ లోభాగంగా ఎర్రుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో వాసవీ క్లబ్, ఐకేపీల సంయుక్తాధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులపోటీలో తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు ఎంపీపీ దేవరకొండ శిరీష, జెడ్పీటీసీ శీలం కవిత చేతుల మీదుగా బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ చైర్మన్ కొప్పు పరమేశ్వర్ రావు, సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ షేక్ మస్తాన్వలీ, ఏపీఎం వెంకటేశ్వర్లు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజేష్, గ్రామీణ వికాస బ్యాంకు ఫీల్డ్ఆఫీసర్ అంజన్, సీసీ కృష్ణారావు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.