సమ్మక్క, సారలమ్మలకు మొక్కుల చెల్లింపు
ఖమ్మం, జూలై 6: వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మొక్కలు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్లకు చీర, సారె, బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు.
తొలుత ఆలయానికి వెళ్లిన ఎంపీతోపాటు కుటుంబ సభ్యులకు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మల గద్దెలు, పగిడిద్దె రాజు, గోవిందరాజులను రవిచంద్ర దర్శించుకున్న అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్, జలవనరుల అభివృద్ధి మండలి చైర్మన్ ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు.