ములకలపల్లి, మార్చి 15: మండల కేంద్రమైన ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పట్లో రూ.5.75 కోట్లు మంజూరు చేసింది.
అయితే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు అధికారులు మొదలుపెట్టారు. ఫోర్లైన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఇతరత్రా పనులు జరుగనున్నాయి. 50 అడుగుల రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ చేసిన ఆర్అండ్బీ అధికారులు.. 50 అడుగుల లోపలి కట్టడాలను, తాత్కాలిక షెడ్లను జేసీబీతో తొలగిస్తున్నారు.