కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 27: సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ హోదాల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ సవరించిన పెన్షన్ ఆర్డర్ (రివైజ్డ్ పీపీవో)ను ఇవ్వడానికి సీఎంపీఎఫ్ నిర్ణయించింది. పెన్షన్ వితంతు పెన్షన్ సెటిల్మెంట్లో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎంపీఎఫ్ ఆర్గనైజేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం సీఎంపీఎఫ్ పీపీవోను సవరించి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను పొందేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ విధానంతో విడో పెన్షన్ పేమెంట్ కోసం ప్రస్తుతం సింగరేణి కార్మికుడు పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే బ్యాంకు అధికారులను సంప్రదించి డెత్ సర్టిఫికెట్ సమర్పిస్తే తక్షణమే సెటిల్ అవుతుంది. దీనికి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను విడుదల చేయడానికి పెన్షనర్లందరూ తమ బ్యాంకు ఖాతాలను సింగిల్ మోడ్ (ఒక్క ఖాతాదారుడు) నుంచి ఫార్మల్ ఆర్ సర్వేయర్ మోడ్లోకి మార్చుకోవాలి. ఈ మోడ్లో మార్చుకోవడంతో పెన్షనర్ మరణిస్తే తర్వాత అదే అకౌంట్ నంబర్పై భార్య లేదా భర్త ఆపరేట్ చేసుకునే వెసలుబాటు ఉంది.
గతంలో పెన్షన్ తీసుకుంటున్న వారు మరణిస్తే విడో పెన్షన్ పొందేందుకు పెన్షనర్ రిటైర్డ్ అయిన మైన్ లేదా డిపార్ట్మెంట్కు వెళ్లి మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత పత్రాలను అందజేసి క్లెయిమ్ ఫాం నిండి ఏరియా టర్మినల్ బెనిఫిట్స్ (ఏటీపీ) సెల్కు అందజేయాల్సి ఉం టుంది. అప్పుడు వారు సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత విడో పెన్షన్ను ఇచ్చేవారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు మూడు నెలల సమ యం పట్టేది. కొన్ని సందర్భాల్లో పత్రా లు సమర్పించే విషయంలో ఉద్యోగి పెన్షన్ యథావిధిగా వారి అకౌంట్లో జమ య్యేది. అలాంటి సమయంలో పెన్షనర్ మరణించినప్పటి నుంచి డిపాజిటైన పెన్షన్ మొత్తాన్ని వారి అకౌంట్లో జమ చేసిన తర్వాత తిరిగి విడో పెన్షన్ను సెటిల్మెంట్ చేసేవారు. ప్రస్తుతం రివైజ్డ్ పెన్షన్ పే మెంట్ ఆర్డర్ ద్వారా అలాంటి పరిస్థితులు ఉండవు. పెన్షనర్ మరణించిన వెంటనే మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని పెన్షన్ పొందుతున్న బ్యాంకు అధికారులకు సమర్పిస్తే వెంటనే ఆటోమేటిక్గా విడో పెన్షన్ను పొందవచ్చు.
పెన్షన్ పెరగలేదు…
రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్కు సంబంధించిన పత్రాలను రిటైర్డ్ అయిన మైన్లు, డిపార్ట్మెంట్లలో సమర్పించాలని అధికారులు అనేక మాధ్యమాల ద్వారా తెలియపరిస్తే ఎక్కువ శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ పెరిగిందని భ్రమ పడుతున్నారు. దీనిద్వారా వారు ఆందోళనకు గురై కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ద్వారా పెన్షన్ను పొందుతున్న వారు మరణిస్తే వారి నామినీగా ఉన్న భార్య/భర్తకు విడో పెన్షన్ పొందేందుకు వెంటనే వీలుంటుంది తప్ప పెన్షన్ పెరుగుదలకు సంబంధించింది కాదు. రిటైర్డ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళనకు గురికాకుండా రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ గురించి తెలుసుకోవాలని, రిటైర్డ్ అయిన వారు ఏ ఏరియాలో సెటిల్ అయినా రిటైర్డ్ అయిన డిపార్ట్మెంట్, మైన్ల వద్ద సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేసి పెన్షన్ను సులభతరంగా పొందాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. రివైడ్జ్ పీపీఆర్ పొందేందుకు బ్యాంకు ఖాతాలను ఫార్మర్ ఆర్ సర్వేవర్ మోడ్లోకి తప్పక మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకున్న బ్యాంకు ఖాతా బుక్ జిరాక్సు కాపీని, పెన్షన్ పొందుతున్న ఆర్డర్ కాపీ, భార్యాభర్తల ఆధార్ కార్డులు, సీఎంపీఎఫ్ మెడికల్ కార్డు, భార్యాభర్తలు కలిసి దిగిన జాయింట్ ఫొటోలు 3, వారు రిటైర్డ్మెంట్ అయి న సమయంలో మైన్, డిపార్ట్మెంట్లో సమర్పించాలి.
రిటైర్డ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి సంస్థలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ రివైజ్డ్ పీపీవో ఆర్డర్ను సద్వినియోగం చేసుకోవాలి. పెన్షన్ పొందుతున్న వారు మరణిస్తే విడో పెన్షన్ వెంటనే సెటిల్మెంట్ అయ్యేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో మాదిరిగా నెలల తరబడి కాకుండా కేవలం వారం రోజుల్లోపే నామినీలకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ పొందుతున్న వారు మరణిస్తే వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును సంబంధిత డెత్ సర్టిఫికెట్లను సమర్పించిన క్షణాల్లోనే పెన్షన్ అమలులోకి వస్తుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులు, కార్మికులందరూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆర్పీపీవో పొందాలని సూచించారు.
– బసవయ్య, జీఎం పర్సనల్