గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ జాతీయ జెండాను ఆవిషరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్.డాక్టర్ శభరీష్, పోలీసు శిక్షణ కేంద్రం, సిటి ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు హెడ్ క్వార్టర్స్, శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ సూల్లో అడిషనల్ డీసీపీ ఏఆర్ కుమారస్వామి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో వి.వి. అప్పారావు, ఖమ్మం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ సురేందర్, ఎక్సైజ్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్ధన్రెడ్డి, నగరంలోని తెలంగాణ భవన్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయాలలో నగర కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ కార్యాలయంలో సీఈఓ అట్లూరి వీరబాబు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్ పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న, నగరంలోని సమీకృత మార్కెట్లో జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి కోలహాలం నాగరాజు, రఘునాథపాలెం మండంలోని పలు కార్యాలయాల్లో, నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ రాజకీయ పార్టీల కార్యలయాలు, యూనియన్ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
– నెట్వర్క్