మామిళ్లగూడెం, జనవరి 25: గణతంత్ర వేడుకలకు నూతన కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల నూతన కలెక్టరేట్ ప్రారంభమైనందున గురువారం నాటి రిపబ్లిక్ డే కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వేడుకల నిర్వహణ కోసం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాట్లు చేశారు. ఏటా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ జరిగే ఈ వేడుకలు ఈసారి నూతన కలెక్టరేట్ ఆవరణలో జరుగనున్నాయి. ఉదయం 9 గంటలరకు కలెక్టర్ జెండా ఆవిష్కరించనున్నారు.