భద్రాచలం, జనవరి 1: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రామయ్యకు సోమవారం ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో రాపత్తు సేవను వైభవంగా జరిపారు.
ముందుగా స్వామివారిని పరవాసుదేవుడు అలంకారంలో అందంగా అలంకరించి, మేళతాళాల నడుమ బేడా మండపానికి తీసుకొని వచ్చి ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, శ్రీరామ అష్టోత్తర శతనామార్చాన తదితర పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్కుమర్, ఆలయ అధికారి లింగాల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.