మణుగూరు టౌన్, మే 23 : రైతుబిడ్డగా జన్మించిన రాకేశ్రెడ్డికి ప్రజల కష్టసుఖాలు తెలుసని, అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నిత్యం సమస్యలపై పోరాడుతారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సమితిసింగారం పంచాయతీలోని అశోక్నగర్ గ్రామంలో పట్టభద్రులను కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చారని, ఆయనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. గోల్డ్ మెడలిస్ట్ కావాలా.. గోల్మాల్ మల్లన్న కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పగిడేరులో విస్తృతంగా ప్రచారం చేసిన జడ్పీటీసీ పోశం నర్సింహారావు.. మొదటి ప్రాధాన్యతా ఓటు రాకేశ్రెడ్డికి వేయాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, నాయకులు కుర్రి నాగేశ్వరరావు, రామసహాయం వెంకటరెడ్డి, కంభంపాటి శ్రీను, వీరపనేని చెన్నకేశవులు, బర్మావత్ నర్సింహులు, గాజుల నరేశ్, గంజి నరేందర్, సూత్రపు నాగభూషణం, సానికొమ్ము అనంతరామిరెడ్డి, పప్పుల ప్రసాద్, బేతమల్ల సుందర్, వేర్పుల నరేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.