ఖమ్మం, మార్చి 20: రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖర్ అభినందనలు తెలిపారు. శాసనసభ్యులు మీ సేవల పట్ల మరింత నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి తిరిగి రాజ్యసభకు ఎన్నుకున్నారని తన సందేశంలో పేరొన్నారు. మరోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఎంపీ రవిచంద్ర రాజ్యసభ చైర్మన్ ధనఖర్ను ఢిల్లీలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వద్దిరాజుతో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేవాలయమైన ఈ పార్లమెంట్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరిపేందుకు మీ అనుభవం ఎంతో అవసరమని అన్నారు. కాగా, తనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చైర్మన్ జగదీప్ ధనఖర్కు ఎంపీ వద్దిరాజు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.