పెనుబల్లి, జూన్ 4: ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. గఏరువాక పున్నమి సందర్భంగా మండలంలోని లింగగూడెంలో ఆదివారం రైతులతో కలిసి పూజలు నిర్వహించి నాగలి పట్టి దుక్కులు దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరువాక అంటే దుక్కులు ప్రారంభమని, జేష్ఠ పున్నమి రోజు దుక్కులు ప్రారంభిస్తే రైతులకు అంతా మంచి జరుగుతుందని అన్నారు. అందుకే జేష్ఠ పున్నిమి రోజున ఏరువాక ప్రారంభిస్తారని అన్నారు. వ్యవసాయ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఆయన కోరారు.
సమయానుకూలంగా పంటలు పండించినట్లయితే మార్కెట్లో వాటికి డిమాండ్ బాగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగానికి దిక్సూచి అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను వ్యవసాయ బంఢాగారంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రైతులందరూ దుక్కులు దున్ని సాగు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, కనగాల వెంకట్రావు, బద్ధం వెంకటేశ్వర్లు, చింతనిప్పు సత్యనారాయణ, మందడపు అశోక్కుమార్, చెలికాని నీలాద్రిబాబు, తేజావత్ తావునాయక్, తేళ్లూరి నాగేశ్వరరావు, కర్ణాటి వీరభద్రారెడ్డి, చీకటి అజిత్, బెల్లంకొండ చలపతిరావు పాల్గొన్నారు.