ఖమ్మం: ఉమ్మడిఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఓటర్లలో 80 శాతం టిఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారని, గెలుపు వన్సైడ్ మాత్రమేనని అన్నారు.
ప్రతి ఓటరు తాతా మధు గెలుపు కోసం కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, పార్టీ నగర అద్యక్షులు పగడాల నాగరాజు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్న లక్ష్మి, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, మాజీ నగర అద్యక్షులు కమర్తపు మురళి,ఆయా డివిజన్ల టిఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.