కల్లూరు, నవంబర్ 29 : కల్లూరు మండలంలో రైతులు రబీ వరిసాగుకు సిద్ధమయ్యారు. మండల పరిధిలోని ముచ్చవరం, పాయపూర్, వాచ్యానాయక్తండా, లింగాల, రఘునాథగూడెం, ఎర్రబోయినపల్లి తదితర గ్రామాల్లో ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తి కావడంతో రబీ పంట వైపు రైతులు దృష్టి సారించారు.
ఆయా గ్రామాల్లో సుమారు 2000 మంది రైతులు ఇప్పటికే తక్కువ కాలంలో వచ్చే వరి వంగడాల విత్తనాలను నారు చల్లుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే రబీకి వరినార్లు సిద్ధమయ్యాయి. అలాగే కొన్ని గ్రామాల్లో వానకాలం పంటకు సంబంధించి వరికోతలకు సిద్ధంగా ఉన్నాయి. మండల పరిధిలో ప్రతి ఏడాది ఖరీఫ్లో వేసినట్లే రబీలో కూడా 33,700 ఎకరాలు సాగుచేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.