ఖమ్మం, ఫిబ్రవరి 21 : ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆరియాలజీ, పర్యాటక శాఖ అధికారులతో ఖమ్మం పోర్టు అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరవాసులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా నిపుణులైన కన్సల్టెంట్లను సంప్రదించి ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఖిల్లాలో రోప్ వే, తాగునీరు, మరుగుదొడ్లు, పారింగ్, ఫుడ్ కోర్టు, మెట్ల రెయిలింగ్, లైటింగ్, గజిబోస్, సీటింగ్ బెంచీలు, విద్యుత్ సరఫరా, కోట ప్రాంత పరిరక్షణతోపాటు పర్యాటక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్లు రామకృష్ణ, శ్రీధర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.