ఖమ్మం: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ప్రధమ సంవత్సరంలోని ఒకేషనల్ ప్రాక్టీకల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ విషయాన్ని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లాలో 35 కేంద్రాల్లో 2756 మంది పరీక్షలకు హజరుకానున్నట్లు వివరించారు. బోర్డు మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.