మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజా భద్రతకు భరోసా కల్పిచేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్.
వారియర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా,మాదక ద్రవ్యాలు, ఇతర నిషేధిత ఉత్పత్తులు అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు.