భద్రాచలం, డిసెంబర్ 26: మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం స్థానిక పశు వైద్యశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ రవీంద్రనాథ్ ఠాగోర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ నానుపల్లి సత్యంయాదవ్, బొల్లి సూర్యచంద్రరావు యాదవ్, కుమ్మరుకుంట సాంబ పాల్గొన్నారు.
రామాలయంలో బాలరాజుయాద్ ప్రత్యేక పూజలు
భద్రాద్రి రామయ్యను రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, డాక్టర్ రాజేశ్వరీ దంపతులు దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
దూదిమెట్లను కలిసిన యాదవ సంఘ నాయకులు
బూర్గంపహాడ్, డిసెంబర్ 26: రాష్ట్ర షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజును బూర్గంపహాడ్ మండల యాదవ సంఘ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దూదిమెట్లను కలిసిన వారిలో యాదవ సంఘం నాయకులు బొల్లు సూర్యం, గంగరాజు, సాంబ, పృథ్వీలతోపాటు యూత్ నాయకులు పలువురు ఉన్నారు.
దుడిమెట్ల బాలరాజు యాదవ్కు సన్మానం
పర్ణశాల, డిసెంబర్ 26: పర్ణశాల సీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్, యాదవ సంగం జిల్లా నాయకులు బొల్లి సూర్యచందర్రావు ఆధ్వర్యంలో సన్మానించారు. బూరుబాబకలోని ఆయన స్వగృహంలో బొల్లి సూర్యచందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలరాజు యాదవ్ మాట్లాడుతూ… యాదవులు రాజకీయాలకు అతీతంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. నక్కా వెంకన్న యాదవ్, కుమ్మరికుంట్ల సాంబశివరావు, బొల్లి సత్యనారాయణ, జంగిలి సంపత్, బాలకృష్ణ, జెట్టి రామకృష్ణ, జక్కుల సందీప్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పాల్వంచ రూరల్, డిసెంబర్ 26: మండలంలోని పెద్దమ్మతల్లిని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆశీర్వచనం పలికి, పట్టువస్ర్తాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.